Saturday, April 27, 2024

సిఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రజలకు పాలన అందిస్తున్నాడు: కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలంగాణ జన సమితి(టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలోను ఇలా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిఎం రేవంత్‌రెడ్డి పాలన తీరుపై ప్రశంసలు కురిపించి, అదే సమయంలో గత పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంక్షలు, భయం చూశామని ఇప్పుడు తల మీది నుంచి భారం తగ్గినట్లుగా ఉందన్నారు.

ఇప్పుడు ఫోన్లు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుతున్నామని, నాలుగో తేదీన వేతనాలు వచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వాన్ని ఓడించాలని తాము పోరాటం చేసి సఫలమయ్యామన్నారు. నియంత పోకడలే గత ప్రభుత్వ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టిన కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రధాని మోదీ తప్పుపట్టారని దానిని తాము ఖండిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని దీనిపై ఈ నెల 21న సదస్సు నిర్వహిస్తామన్నారు. భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News