Saturday, July 27, 2024

రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్‌పాల్ బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కే సులో మరో కీలక పరిణామం చోటు చేసుకుం ది. ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. నాగ్ పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామక మయ్యారు. దీంతో ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును  జడ్జి కావేరి విచారించనున్నారు. నాగ్‌పాల్‌తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్ లోని మరో 26 మంది జడ్జీలు సైతం మంగళవారం బదిలీ అయ్యారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ఇడి అరెస్ట్ చేసిన విషయం విదితమే.

హైదరాబాద్‌లో కవితను అదుపులోకి తీసుకున్న ఇడి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. కవిత రిమాండ్‌పై వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్. ఆమెను ఏడు రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చారు. కవిత అరెస్ట్ కావడం, ఆమెను వారం రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే జడ్జి నాగ్‌పాల్ బదిలీ కావడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగ్‌పాల్ అనూహ్యంగా ట్రాన్స్‌ఫర్ కావడం తీవ్ర చర్చనీ యాంశమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News