Sunday, May 12, 2024

‘సర్కారు వారి పాట’ మొదలైంది

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు షూటింగ్‌కి సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దర్శకుడు పరశురామ్ హీరో మహేష్ బాబుకి సన్నివేశాన్ని వివరించే వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కొంత కాలం క్రితం చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా పరీక్షలు పూర్తి చేయగా… టీమ్ అందరికీ కూడా నెగటివ్ రావడంతో షూటింగ్ షురూ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Sarkaru vaari Paata Movie shoot resumes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News