Sunday, April 28, 2024

భారత్‌-శ్రీలంక మ్యాచ్ సమయాల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

కొలంబో: భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరో మార్పు జరిగింది. కరోనా కారణంగా ఇప్పటికే సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి మంగళవారం ప్రారంభం కావాల్సి సిరీస్‌ను ఈ నెల 18కు వాయిదా వేశారు. ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన శ్రీలంక క్రికెటర్లు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. జట్టు కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా ఎనాలిస్ట్ తదితరులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లంక క్రికెటర్లు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తాజాగా మ్యాచ్ సమయాల్లో కూడా మార్పులు చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30 గంటలకు బదులు 3 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ట్వంటీ20 మ్యాచ్‌లు రాత్రి ఏడుకు బదులు 8 గంటల నుంచి జరుగుతాయి.

Timings Change in IND vs SL ODI Series 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News