Saturday, April 27, 2024

మార్పు చూసి తీర్పు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్‌లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న నియామకాల మీదనే తీర్పు ఇ వ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇ ప్పటివరకు 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నా రు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడగొట్టాకే, యువతకు ఉ ద్యోగాలు వస్తున్నాయని, ఆత్మబలి దానాలతో సాధించిన తెలంగాణలో నేటి ప్ర భుత్వం అమరులు స్పూర్తిని తీసుకుని పనిచేయాల్సింది పోయి వారి లాభార్జన, ధ న దాహం తీర్చుకోవడానికి పనిచేశారని నిప్పులు చెరిగారు. సోమవారం ఎల్‌బి స్డేడియంలో నూతనంగా నియమితులైన 543 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 1,463 జూ నియర్ కళాశాలల లెక్చరర్లు, 2,632 టిజిటి ఉపాధ్యాయులు, 479 మంది కా నిస్టేబుళ్లు, 75 మంది వైద్య సిబ్బందికి నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భం గా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కా ర్యక్రమం ప్రచారం కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం, న మ్మ కం కల్పించడానికి చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిరుద్యోగ యవతకు స్ఫూర్తిని ఇచ్చేందుకు, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకుల కు ఒక భరోసా ఇచ్చేందుకు చేపడుతున్నామని పునరుద్ఘాటించారు. మా ప్రభు త్వం వచ్చింది మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించడానికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎల్‌బి స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఇదే ఎల్‌బి స్టేడియం లో 2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతులపై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బకాయిలు రద్దు చేస్తూ మొదటి సంతకం చేసి మన ప్రాంతంలో రైతును రాజును చేసేందుకు పునాది వేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడిందని, కొందరు ఆత్మబలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ సాధించారని, తమ ఆత్మ బలిదానాలతో తమ భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు వస్తాయని అమరులు నమ్మారని పేర్కొన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి, ఉపాదిహామీ పనులకు వెళ్లి తమ బిడ్డలను అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్ లోనే కోచింగ్ సెంటర్లకు పంపితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదని, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని, ప్రశ్నాపత్రాల దిద్దడం సరిగా ఉండేది కాదన్నారు. దీంతో విసిగిపోయిన నిరుద్యోగ యువత ముందుకు వచ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వచ్చామన్నారు.
కొడంగల్‌లో మోడల్ స్కూల్ ఏర్పాటు
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చామని గత పాలకులు చెబుతున్నారని, వాటిలో ఎక్కడైనా మౌలిక వసతులు కల్పించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే మోడల్ గురుకుల పాఠశాల తీసుకురావాలని కొడంగల్ నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో 25 ఎకరాల్లో ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని 119 కాసనసభ నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ఈ నమూనా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని బావిస్తున్నామని ఆయన తెలిపారు. పేద విద్యార్ధులందరికి విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి కిలోమీటర్‌కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి అయిదు కిలోమీటర్లకు ప్రాథమికొన్నత పాఠశాల, ప్రతి పది కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కళాశాల, పతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలనే విద్యా విదానం ప్రకారం 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 6 వేల పాఠశాలలను మూతవేసి దళితులు, గిరిజనులు, వెనుకబడి న ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసి బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలి, గొర్రెలు పెంచుకునే వారు. గొర్రెలు కాసుకోవాలె, చేపలు పట్టుకునే వారు చేపలు పట్టుకోవాలే అనే పథకాలు తీసుకొచ్చిందని మండిపడ్డారు. మన తాతలు, తండ్రులు గొర్రెలు కాస్తే, బర్రెలు కాస్తీ, చెప్పులు కుడితే మన పిల్లలు అవే పనులు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో వారు భాగస్వాములు కావద్దా, వారు గొర్రెలు, బర్రెలు కాసుకోవాలా అని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి మనవడు పెంచుకున్న కుక్క చనిపోతే వెటర్నరీ వైద్యుడిపై కేసు పెట్టి లోపల వేశారని, మరి ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఉరి వేయాలా వద్దా అని ప్రశ్నించారు. వారి పెంపుడు కుక్కకున్న విలువ పేదల ప్రాణాలకు లేదా అన్నారు.
లక్షలాది మందికి విశ్వాసం కల్పించేందుకే
ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను తీసుకోవడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఈ ఉద్యోగ నియామక పర్రాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా అందేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. కొత్తగా ఉద్యోగ నియామక పత్రాలు పొందే కుటుంబాల్లోని ఆనందం రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అయ్యేలా ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం నిరుద్యోగ యవతకు స్ఫూర్తి కావాలని, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసా ఇవ్వాలని, మా ప్రభుత్వం వచ్చింది. మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించడానికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేశామన్నారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మెగా డీఎస్సీ ద్వారా 11,604 టీచర్ల భర్తీలు చేయబోతున్నామన్నారు.
డ్రగ్స్ మాట వినపడొద్దు…
గడీల్లో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాల్లోకి తెచ్చామా లేదా అనే విషయం మీరంతా ఆలోచించాలని కోరారు. ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్లి చర్చించాలని విజ్ఞప్తి చేశారు. దేశ యువతను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. యువత చాలాచోట్ల డ్రగ్స్, గంజాయి, వ్యసనాల వైపు పోతోందని, విలువలతో కూడిన జీవితాన్ని ఎలా సాగించాలో విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను ఉపాధ్యాయులే నేర్పాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్ అనే మాట వినపడవద్దని, తెలంగాణ తులసీవనంలో గంజాయి మొక్కలు ఉండవద్దని వాటిని కూకటి వేళ్లతో పీకివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యసనాలు, గుడ్ టచ్, బ్యాడ్ ట్ప పిల్లలకు ఉపాద్యాయులు నేర్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. 6,546 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలనుకున్నామని, ఎమ్మెలీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడితో కొన్ని నియామక పత్రాలు ఆగాయని, నేడు 5,192 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మిగతా వారికి కోడ్ పూర్తికాగానే వారి ఇళ్లకు నియామక పత్రాలు పంపుతామని వెల్లడించారు. విద్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం ఉండాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News