Friday, April 26, 2024

రెండు రోజుల్లో సెలక్ట్‌ కమిటీ: షరీఫ్

- Advertisement -
- Advertisement -

Chairman-Sharif

అమరావతి: రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… శాసనమండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్తుందన్నారు. శాసనమండలి రద్దయితే… వికేంద్రీకరణ బిల్లు సంగతేమిటనేది తనకు తెలియదన్నారు. మండలిలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలని, మెజార్టీ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని షరీఫ్ అన్నారు. కాగా, బిల్లును సెలక్ట్ కమిటీకి పంపంచడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం స్వర్వసాధారణమని తెలిపారు. తాను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అంతకుముందు ఛైర్మన్ షరీఫ్ శాసనమండలిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.

select committee will be appointed in two days says Sharif

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News