Saturday, April 27, 2024

సెన్సెక్స్ @ 73,000

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. మంగళవారం ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్‌ల సూచీ నిఫ్టీ బ్యాంక్ 560 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌లలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 73,057 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 73,000 మార్క్‌ను అధిగమించడంలో విజయవంతమైంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 75 పాయింట్ల జంప్‌తో 22,196 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీ చారిత్రక గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. మార్కెట్‌లో బూమ్ ఉన్నప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు డౌన్ అయ్యాయి. బ్యాంకింగ్ మినహా ఇతర రంగాల స్టాక్స్ క్షీణించాయి. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.391.69 లక్షల కోట్లు ఉండగా, మంగళవారం ఇది రూ.391.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఇన్వెస్టర్ల సంపద రూ.7000 కోట్లు పడిపోయింది. మంగళవారం సెషన్‌లో బ్యాంకింగ్ స్టాక్‌లలో పెరుగుదల ఉంది. దీంతో పాటు రియల్ ఎస్టేట్, మీడియా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల స్టాక్‌లు కూడా పెరిగాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో ముగియగా, 12 నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News