Wednesday, April 24, 2024

తిరుమలగిరిలో దారుణం..

- Advertisement -
- Advertisement -

తిరుమలగిరిలో దారుణ ఘటన జరిగింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సెరినిటీ ఫౌండేషన్ రీహబిలిటేషన్ సెంటర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత నెల 26న కెవిన్ అనే యువకుడు కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు రీహబిలిటేషన్ సెంటర్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. కెవిన్ ను హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News