Thursday, April 25, 2024

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా 1989 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.శాంతికుమారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా శాంతికుమారి నియమితులయ్యారు. త్వరలోనే ఆమె సిఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా తనకు సిఎస్‌గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్‌లో కెసిఆర్‌ను శాంతి కుమారి కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎస్‌సి మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఎ పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఎఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సిఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టిఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News