Friday, April 26, 2024

మూడు తొండాల విఘ్నేశుడు

- Advertisement -
- Advertisement -

story of trishund ganpati temple

ఏపని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడినే. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలున్నాయంటే ఆశ్చర్యపడకమానం. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనెలో ఉన్న సోమ్వార్‌పేట్ జిల్లాకి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉందీ త్రిసూంద్ గణపతి దేవాలయం. బీమజిగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1954లో మొదలుపెట్టారట. 16 సంవత్సరాల నిర్మాణం తర్వాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొం డాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి.

ఆలయ ప్రాంగణంలో కూడా అనేక దేవతావిగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనబడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో కనిపిస్తుంది. ఓ గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనుప గొలుసులతో కడుతున్నట్లుగా ఉండే విగ్ర హం ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేం. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశైవుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశే షం. ఆలయం కింద భాగంలో నీళ్ళు నిల్వ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పట్నించో కొనసాగుతూ వస్తుందట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందట. ఇక వినాయక ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పక్కర్లేదు. తొమ్మిది రోజులు పూనె చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిరహిస్తారు. రాజస్తానీ, మాల్వ మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్టు నడిసిస్తుందని చెబుతున్నారు ఇక్కడ అధికారులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News