ఐపిఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ముంబై ఓడినప్పటికీ.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కొత్త చరిత్ర (New Record) సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 700లకు పైగా పరుగులు సాధించిన తొలి ముంబై ఇండియన్స్ బ్యాటర్గా, ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి నాన్ ఓపెనర్గా అతను రికార్డుల్లోకెక్కాడు.
ఈ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) 16 మ్యాచుల్లో 167.92 స్ట్రైక్రేటుతో, 65.18 యావరేజ్తో, ఐదు హాఫ్ సెంచరీలతో 717 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన లిస్ట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 2010లో సచిన్ 618 పరుగులు చేశారు. దీంతో పాటు మరో ఘనతను (New Record) కూడా స్కై సాధించాడు. ఆడిన 16 ఇన్నింగ్స్ల్లోనూ 25+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా అతను నిలిచాడు. స్కై తర్వాతి స్థానంలో రాబిన్ ఉతప్ప ఈ రికార్డు సాధించాడు. ఉతప్ప వరుసగా 10 ఇన్నింగ్స్లో 25+ పరుగులు చేశాడు.