Saturday, April 27, 2024

ప్రజలు బయటకు రావొద్దు.. అధికారులను అప్రమత్తం చేసిన తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా గ్రేటర్ పరిధిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, కలెక్టర్ తో మంత్రి తలసాని మాట్లాడారు.

ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు.అత్యవసర సేవలకు జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ 21111111, 23225397 నంబర్లను సంప్రదించాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News