Tuesday, April 30, 2024

ఇసికి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహారావు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియో గం చేస్తోందని వెల్లడించారు. కొందరు అధికారులు వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని, విపక్ష నేతలను వైసిపి ప్రభుత్వం వేధిస్తోందని ఇసికి వివరించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఎపిలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌లలో వీడి యో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం బిజెపి నేత అరుణ్ సింగ్ మాట్లాడుతూ, ఎపి డిజిపి, సిఎస్, ఇంటెలిజెన్స్ డిజిపి వైసీపీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నారని, వారు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నార న్న విషయాన్ని ఇసి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఇప్పటికే చంద్రబాబు అనేక ఫిర్యాదులు చేశారని అరుణ్ సింగ్ పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు చేపట్టాలని విన్నవించుకున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మూడు పార్టీల నేతలం మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిసి కొన్ని నివేదికలు అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో క్షీణిం చాయని, సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ లేదన్న విషయాన్ని ఇసికి వివరించామని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైనా చాలా ప్రాంతాల్లో కావాలనే రాళ్ల దాడులు చేయిస్తున్నారన్న విషయాన్ని ఇసికి తెలియజేశామన్నారు. డిజిపి, ఇంటెలిజెన్స్ డిజిపి, సిఎస్‌ల పర్యవేక్షణ లోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్టు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఓటరు లిస్టు అక్రమాలపై జాగ్రత్తగా పరిశీలన చేపట్టాలని ఇసిని కోరామని చెప్పారు. అధికారం కోల్పోతామన్న భయంతో జిల్లాల్లో కిందిస్థాయి అధికారులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తమ వద్ద ఉన్న ఆధారా లతో చంద్రబాబు ఇప్పటికే పలు లేఖలు రాశారని వివరించారు.

ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతం అని నాదెండ్ల స్పష్టం చేశారు. టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, మంగళవారం ఎన్డీయే నేత అరుణ్ సింగ్ నేతృత్వంలో తాము ఎన్నికల సంఘాన్ని కలిశామని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కూడా కలిసి ఎపిలో పరిస్థితులను వివరించామని వెల్లడించారు. ఎపి సిఎస్, డిజిపి, ఇంటెలిజెన్స్ డిజిపి రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఇసికి నివేదించామని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా సిఎస్ తనకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చిన వైనాన్ని, సిఇఒను కూడా తన వద్దకు పిలిపించుకుని సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహ రిస్తున్న తీరును ఇసికి వివరించామని కనకమేడల తెలిపారు. డిజిపి పోలీసు బలగాన్నంతా తన నియంత్రణలో ఉంచుకుని, ప్రధాని హాజరైన సభకు కూడా సరైన బందోబస్తు కల్పించకుండా, ప్రోటోకాల్ చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విషయాన్ని ఇసికి తెలియజేశామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News