Tuesday, May 7, 2024

వాగు దాటడానికి జెసిబిలను ఆశ్రయించిన టీచర్లు

- Advertisement -
- Advertisement -

విజయనగరం: ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బుధవారం ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివానివలస సమీపంలో భవానమ్మ వాగు పొంగి పొర్లడంతోంది. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరేందుకు గజంగుడ్డివలస పాఠశాల ఉపాధ్యాయులు జేసీబీలను ఆశ్రయించిన పరిస్థితి ఏర్పడింది. టీచర్లు జేసీబీలతో వాగు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News