Thursday, May 30, 2024

ఐదో ర్యాంక్‌కు టీమిండియా..

- Advertisement -
- Advertisement -

Team India at 5th spot in ICC ODI Rankings

ఐదో ర్యాంక్‌కు టీమిండియా
పాక్‌కు నాలుగో స్థానం, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సోమవారం ప్రకటించిన తాజా వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నాలుగో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. టీమిండియాను వెనక్కినెట్టి పాక్ ఈ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. అయితే కొంత కాలంగా టీమిండియా వన్డే క్రికెట్ ఆడడం లేదు. దీని ప్రభావం ర్యాంకింగ్‌పై స్పష్టంగా కనిపించింది. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 105 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో నిలిచింది. విండీస్‌పై క్లీన్ స్వీప్ సాధించిన పాకిస్థాన్ 106 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక న్యూజిలాండ్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. ఇంగ్లండ్ రెండో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

Team India at 5th spot in ICC ODI Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News