Saturday, July 27, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై ఇడి ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఇడి మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఇడి అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అన్ని వివరాలు వెల్లడించారు.

మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఇడి వెల్లడించింది. అయితే ఈనెల 10న మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఇడి, కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంది. ఇడి అరెస్టుతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత, చరణ్‌జీత్‌లకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌ను అరెస్టు చేయకపోవడం వల్ల, వచ్చేనెల 3న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News