Friday, April 19, 2024

నేడు కేబినెట్ మీటింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు నేడు కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేయనున్నట్టుగా తెలిసింది.
ఏప్రిల్ నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం
దీంతోపాటు సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి, విధానాలతో పాటు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ఏప్రిల్ నుంచి ప్రారంభించే అవకాశం ఉండడంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించి అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు 58, 59 కింద క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో గ్రామకంఠం సహా ఇతరత్రా ఇళ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News