Saturday, July 27, 2024

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలోనే సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అ యితే అత్యవసర విషయాలను మాత్రమే ఈ భేటీ లో చర్చించాలని ఈసీ షరతులు విధించింది. జూ న్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సం ఘం షరతులో భాగంగా తెలిపింది. అలాగే ఏజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రా జధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తే దీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలు, వాటిపై చర్చ లు, నిర్ణయాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పా ల్గొంటున్న అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఈసీ పేర్కొంది. రైతు రుణమాఫీ, ఎపి, -తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇంకా రైతులకు సంబంధించిన అనేక అంశాలు, పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభానికి సన్నాహకాలపైన శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే మరోవైపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై కూడా సిఎం చర్చించాలని భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్, -నల్గొండ, -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంత్రిమండలి సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది.

అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లాలని భావించగా….
ఈసీ నుంచి అనుమతి వస్తుందని భావించి శనివారం రాత్రి 7 గంటల వరకు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయంలోనే వేచి చూశారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేశారు. సోమవారం వరకు ఈసీ స్పందించకపోతే ఢిల్లీకి వెళ్లి కలవాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి షరుతులతో కూడిన అనుమతిని ఇస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది: ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ
కేబినెట్ సమావేశం నిర్వహించుకోడానికి ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అది పూర్తయ్యేంత వరకు కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అంశాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరమైన విషయాలపై చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఆ లేఖలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎజెండాలోని అంశాలను పరిశీలించిన తర్వాత జూన్ 2వ తేదీతో ముగుస్తున్న ఉమ్మడి రాజధాని అంశాన్ని, రైతులకు అమలు చేయాల్సిన రుణమాఫీ అంశాలను జూన్ 4వ తేదీ తర్వాత మాత్రమే డిస్కస్ చేయాలని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News