Sunday, April 28, 2024

డబుల్ ఇండ్లకు లక్కీడ్రా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రంగారెడ్డి: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మొ దటి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున జిల్లాలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్ , మహేశ్వ రం, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 2000 మందికి రాష్ట్ర విద్య శాఖ మంత్రి స బితా ఇంద్రారెడ్డి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు పుత్రిక పథకాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ఒకటి అని అన్నారు. పే దలకు ఉచితంగా  ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. రాజేంద్రనగర్‌లో 4166, ఎల్బీనగర్ లో 4752, మహేశ్వరం లో 651, శేరి లింగంపల్లిలో 2910 మొత్తం 12479 దరఖాస్తులను పరిశీలించి మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 2 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి విడతల వారీగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పేదవారు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇళ్ళు కట్టించడం జరిగిందని మంత్రి తెలిపారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందని ఈ ప్రక్రియ ఇండియాలో మొదటి సారిగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవే కాకుండా స్థలం ఉన్న వారు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షలు రూపాయలు పొంది ఇండ్లు నిర్మించుకోవటానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్.ఐ.సి సహకారంతో ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా ఈ సాఫ్ట్ వేర్ నిబద్దతతో కూడిన ప్రక్రియగా భావించ వచ్చని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే లబ్ధిదారుల ఎంపిక ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హర్‌నాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News