Tuesday, April 30, 2024

శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది.

హైదరాబాద్ లో రాజా సింగ్ రామనవమి శోభా యాత్రకు నేతృత్వం వహించనున్నారు. యాత్ర కోసం ఆయన ఇటీవల వాలంటీర్ మీటింగ్ ను కూడా నిర్వహించారని భోగట్టా. సోషల్ మీడియాలో రాజా సింగ్ ధూల్ పేట్ లోని ఆకాశ్ పురి హనుమాన్ మందిరం నుంచి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి యాత్ర మొదలవుతుందని, స్వచ్ఛంద కార్యకర్తలు దీనిని విజయవంతం చేయాలని రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News