Saturday, May 4, 2024

రూ.2 వేల కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. అక్టోబర్ మూడో తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. మరో రూ.2 వేల కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందుకోసం 9, 21 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. తెలంగాణతో పాటు మరో 13 రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ.22,500 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రూ. 2 వేల కోట్లు చొప్పున, అస్సాం, ఛతీస్‌గడ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు రూ.1000 కోట్ల చొప్పన,హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు రూ.1500 కోట్లు, ఉత్తర ప్రదేశ్ రూ.3 వేల కోట్లు, ఉత్తరాఖండ్ రూ. 500 కోట్లు చొప్పున 14 రాష్ట్రాలు మొత్తం రూ. 22,500 కోట్లు నిధులను బాండ్ల వేలంలో సమీకరించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News