Saturday, July 27, 2024

బిఆర్‌ఎస్‌కు మరో షాక్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నికల చెల్లదని హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు రూ.50వేల జరిమానాను విధించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో ఎన్నికయ్యారు. పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పిం చడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాజేశ్వర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్న ట్లు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. అయితే తాను నామి నేషన్‌ను ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కోరారు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News