Thursday, March 28, 2024

దేశానికే తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడిన వేళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని అంకంపాలెం గ్రామంలో జాతీయ జెండాను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆవిష్కరించారు. అనంతరం పట్వారీగూడెం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని, తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుందని, వ్యవసాయం దండగ అన్న కాడనుంచి వ్యవసాయాన్ని పండగల ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని, కొన్ని పార్టీల నాయకులు కొంతమంది వచ్చి ఓట్లు వేయమని అడుగుతారని, ఎవరికి వేయాలో ఎందుకు వేయాలో అందరూ ఆలోచించాలని, అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందుంది అంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే అని, రేపు మీ ఇళ్లకు వేరే పార్టీ వారు వచ్చి ఓటు అడిగితే ఎందుకు వేయాలి అనే ప్రశ్న మీరు అడగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసే అభివృద్ధి నీ మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News