Tuesday, May 7, 2024

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 614 new corona cases

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో 434 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 614 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,520 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,062కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.తాజాగా కరోనా నుంచి 2,387 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,70,047 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.21 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.
ఏపీలో 500 దిగువకు కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు 500 దిగువకు చేరుకున్నాయి. కొత్తగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 4,636 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,726 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 15,193 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో ఒకరు మరణించారు.

Telangana Reports 614 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News