Friday, May 3, 2024

తెలంగాణ ద్రోహులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు బిజెపి కారణమైందని, మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మూడు పంటలు పండాలనే సిఎం కెసిఆర్ ను కడుపులో పెట్టి చూసుకుందామని ఎవరూ తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. సద్దితిన్న రేవు తలవాలని సిఎం కెసిఆర్ ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.

Also Read: ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం

టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బిజెపి కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని దుయ్యబట్టారు.  సమైక్యాంధ్ర మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారని, వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహులని, వారిని అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News