Sunday, May 5, 2024

మా నిధులివ్వండి

- Advertisement -
- Advertisement -

ఎన్నిసార్లు కోరినా, లేఖలు రాసినా పట్టించుకోరా? పునర్వవస్థీకరణ
చట్టం సెక్షన్ 94 (2) కింద రెండేళ్ల బకాయిలు రూ.900 కోట్లు విడుదల
చేయండి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన
బకాయిలు తీర్చండి అకారణంగా వీటిని పట్టి ఉంచడం అన్యాయం
కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మళ్లీ లేఖ

రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు తదితర నిధులను వెంటనే విడుదల చేయండి

Telangana want central funds

మన తెలంగాణ /హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను శనివారం కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మరోసారి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయిలు 900 కోట్ల రూపాయలను విడుదల చేయలేదని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు. ఈ నిధులను విడుదల చేయడంతో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లను 2021-22 తర్వాత కూడా మరో ఐదేళ్లపాటు పొడిగించాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు.

నీతిఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రానికి రూ.24,205 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 817 కోట్ల 61 లక్షల రూపాయల (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) నిధులు రావాల్సి ఉందని, కానీ అకారణంగా ఈ నిధులను ఇవ్వకుండా తిరస్కరించడం అన్యాయమని మంత్రి హరీష్ రావు ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారని, అందుచేత వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చూడాలని మంత్రి హరీష్‌రావు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు.

2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని, ఈ మేరకు తెలంగాణకు 723 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని, ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన దాఖలాలు లేవని, కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో… రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో తెలంగాణ వాటా నిధులను పొరపాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని, కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ తప్పిదాన్ని కేంద్రమే సరిదిద్దుకొని 495 కోట్ల 20 లక్షల రూపాయలను వెంటనే తమ రాష్ట్రానికి విడుదల చేయాలని కోరారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఈ నిధులను సర్దుబాటు చేయలేదని, కాబట్టి ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయాలని కోరారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు 210 కోట్ల రూపాయల కూడా సర్దుబాటు చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News