Sunday, April 28, 2024

పోస్టల్ బ్యాలెట్లపై ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగించారని అభ్యర్థుల ఆరోపణలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించారని నిరసన చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సీల్ తొలగించి ఉండటం, అందులో ఉన్న బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆరు బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాలి. కానీ ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండటంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News