Saturday, April 27, 2024

స్ట్రీట్ లైట్ పనితీరు మెరుగుపడకపోతే ఒప్పందం రద్దు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గ్రేటర్‌లో ప్రతి స్ట్రీట్ లైట్ వెలిగేలా చర్యలు తీసుకోవాలని,లేకపోతే ఒప్పందం రద్దు చేసుకునేందుకు సైతం వెనకడబోమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ ఈ ఎస్ ఎల్ ఏజేన్సీను హెచ్చరించారు. సోమవారం స్ట్రీట్ లైట్లను పనితీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌తో కలిసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ.ఎన్.సి, ఈ ఈఎస్‌ఎల్ ఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎల్‌ఇడి స్ట్రీట్ లైట్లు పనితీరుపైప్రజలు కాకుండ కార్పొరేటర్‌సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నరన్నారు. వీధి లైట్ల సమస్యలను కూడా సత్వర పరిష్కరించకపోవడం దారుణమన్నారు. స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశంలో కూడా సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కనీసం స్ట్రీట్ లైట్ కూడ పెట్టించలేకపోతున్నమన్న ఆవేదన వ్యక్తం చేస్తునరని చెప్పార. కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ ఎజెన్సీలకు నెలనెలా క్రమం తప్పకుండ బిల్లులు చెల్లిస్తామని, ఈ నిధులను జిహెచ్‌ఎంసి సంబంధించిన సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలని ఎజెన్సీలకు అదేశించారు. ఇతర రాష్ట్రాల్లో బిల్లులు పెండింగ్‌లో ఉంటే జిహెచ్‌ఎంసికి ఎమిటీ సంబంధమని, ఇకనైనా సేవలను మెరుగుపర్చాలని కోరారు. అందుకు అనుగుణంగా మరమ్మతులకు సంబంధించిన స్టాక్ ను త్వరలో గోడౌన్ లో సిద్ధం చేయాలని, ప్రతి సర్కిల్ కి రెండు చొప్పున ల్యాడర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 70 ఓల్టేజ్ బల్బులు కొరత ఉన్నందున రెండు వారాల్లో 3000 బల్బులుఆ తర్వాత మరో 3 వేల బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అంతేకాకుండా సిసిఎంఎస్ ద్వారా -గ్లోయింగ్ ఆన్ ,ఆఫ్ మాన్యువల్ గా చేస్తున్నారని, ఇది కూడా సక్రమంగా చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ఒప్పందం ప్రకారం 5 శాతం బఫర్ స్టాక్ నిర్వహించడం లేదు. శాశ్వతం గా సమస్యలు లేకుండా లిఖిత పూర్వకంగా రెండు రోజుల్లో తె లియజేయాలని ఈఈ యస్ ఎల్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్టాండింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఫి ర్యాదులు చేసినా కనీసం స్పందించడం లేదని అసలు ఎ వ్వరూ బాధ్యులని ఈఈఎస్‌ఎల్ అధికారులను నిలదీశారు.ఈ సమావేశంలో ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, స్టాండింగ్ కమిటీ సభ్యు లు శాంతి సైజెన్ శేఖర్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్,మహమ్మద్ అబ్దుల్ ముక్తాదర్, మహమ్మద్ మాజిద్ హుస్సేన్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బండారి రాజ్ కుమార్, వనం సంగీత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, టి. మహేశ్వరి, ఆర్.సునీత, జోనల్ కమిషనర్లు శంకరయ్య, అశోక్ సామ్రాట్, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, ఇ.ఇ.ఎస్.ఎల్ సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News