Friday, April 26, 2024

ఉగ్రవాదమే మా ప్రధాన సమస్య : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్ : తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని, చాలాకాలంగా పాకిస్థాన్‌ను ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బుధవారం పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీస్ వ్యాన్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఖైబర్ ఫక్తుంఖ్వా లోని లాకీ మార్వాత్ లో ఓ పోలీస్ వ్యాన్‌పై బుధవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News