Saturday, May 4, 2024

క్రేజీ కాంబినేషన్‌లో ‘తమ్ముడు’ షురూ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వ ంలో ‘తమ్ముడు‘ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రానికి ‘దంగల్, కహానీ, తారే జమీన్ పర్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

Also Read: పాతబస్తీలో డ్రోన్ సర్వే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News