Thursday, March 28, 2024

మూడోటెస్టు ధర్మశాల వేదిక మార్పు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ట్రోఫీలో భాగంగా మార్చి 1నుంచి జరగాల్సిన వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉండగా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో వేదిక మార్చాలని బిసిసిఐ నిర్ణయించింది. ఇటీవల పిచ్ పునరుద్ధరణ పనులు చేపట్టగా అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ధర్మశాల గ్రౌండ్ సిద్ధం కాలేదు. అయితే మూడో టెస్టు ఎక్కడ నిర్వహించేంది నిర్ధారించలేదు.

ఇండోర్, రాజ్‌కోట్ తదితర వేదికలును పరిగణనలోకి తీసుకోనున్నారు. హెచ్‌పిసిఎ స్టేడియం శ్రీలంక మధ్య జరిగినరెండు ఆతిథ్యమిచ్చింది. అనంతరం కొత్త డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఇంతవరకు ధర్మశాల కేవలం ఒక టెస్టుకు మాత్రమే ఆతిథ్యమిచ్చింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుకు ఆతిథ్యమివ్వగా సిరీస్‌ను 21తేడాతో కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News