- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లహ్, గండెర్బల్ సెక్టర్లలో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంచు కొండ చరియలు విరిగపడడంతో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్పై సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్ విరుకుపడింది. దీంతో పహార కాస్తున్న ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. సమాచారం అందుకుని వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం నలుగురు జావాన్లను రక్షించింది. మిగతా జవాన్లు తుఫాన్ ధాటికి గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు జవాన్లు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. మరో జవాన్ గల్లంతయ్యాడని, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు.
Three Indian Army Soldiers Killed after Avalanche hit
- Advertisement -