Friday, May 3, 2024

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు- ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News