Monday, April 29, 2024

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం….

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 25,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.77 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News