Monday, April 29, 2024

గుండంపల్లికి చేరుకున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నిర్మల్: తెలంగాణ పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పర్యటన నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హెలికాఫ్టర్ లో దిలావర్ పూర్ మండలం గుండంపల్లికి చేరుకున్నకెటిఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.మరి కాసేపట్లో గుండంపల్లిలో లక్ష్మీ నరసింహ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభిస్తారు. అనంతరము దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్ ను పరిశీలించి పూజ నిర్వహించనున్నారు. సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పి ఛైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, బోథ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News