Sunday, April 28, 2024

బ్రిడ్జి పైనుంచి కిందపడిన బస్సు: 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటలీలోని వెనీస్ నగరంలో బుధవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి బస్సు కిందపడిపోవడంతో 21 మంది మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు కిందపడగానే మంటలు చేలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బ్రిడ్జి పైనుంచి 15 మీటర్ల లోతులో పడినట్టు సమాచారం. 40 మంది యాత్రికులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News