Saturday, April 27, 2024

తిరుమల లడ్డు ఆన్ లైన్ బుకింగ్ పై స్పందించిన టిటిడి..

- Advertisement -
- Advertisement -

ఆన్ లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, వాటిని భక్తులు నమ్మవద్దని టిటిడి అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు మాట్లాడుతూ.. టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు ఇవ్వడంలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలిపారు.

టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టిటిడి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News