Friday, April 26, 2024

టిఎంసి నాయకుని హత్య

- Advertisement -
- Advertisement -

TMC-leader

శాంతిపూర్ (పశ్చిమ బెంగాల్ ): నాడియా జిల్లా శాంతిపూర్ ఏరియాలో స్థానిక టిఎంసి నాయకుడు షంతాను మహతోను అతని ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అక్కడి నుంచి పారిపోయే ముందు నాటుబాంబులు పేల్చారు. ఆగంతకులు ముసుగులు ధరించి ఉన్నారని పోలీసులు చెప్పారు. టిఎంసి కుమ్ములాటల వల్లనే ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. టిఎంసి ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ ఈ సంఘటనను ఖండిస్తూ నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది పార్టీ అంతర్యుద్ధం వల్ల కాదని ఆయన అన్నారు. ఎవరైనా తమ పార్టీ వారు బాధ్యులైతే తాము తగిన చర్య తీసుకుంటామని చెప్పారు.

TMC Leader Murder in Shantipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News