Saturday, April 27, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

శనివారం శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 25,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News