Saturday, June 1, 2024

పిఎన్జీ, సిఎన్జీ ధరలను తగ్గించిన టొరెంట్ గ్యాస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పిఎన్జీ, దేశీయ సిఎన్జీ ధరలను వరుసగా కిలోకు రూ.5, సిఎస్ఎమ్ కి రూ.5 తగ్గిస్తున్నట్లు టోరెంట్ గ్యాస్ ప్రకటించింది. ఇది ఉన్న అన్ని భౌగోళిక ప్రాంతాలలో 17 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తుంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ద్వారా దేశీయ సహజవాయువు కేటాయింపులు పెరగడం వల్ల ధరల తగ్గింపు సాధ్యమైంది. సిజిడి రంగంలోని దేశీయ పిఎన్జీ, సిఎన్జీ విభాగాలకు గ్యాస్ కేటాయింపు కోసం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క సవరించిన మార్గదర్శకాల ప్రకారం, జనవరి నుండి మార్చి 22 త్రైమాసికంలో సగటు వినియోగంలో 85% అంతకుముందు కేటాయింపులకు బదులుగా, సిజిడి రంగ అవసరాలలో దేశీయ గ్యాస్ వాటా ఏప్రిల్ నుండి జూన్ 22 త్రైమాసికంలో సగటు వినియోగంలో 94%కి పెరిగింది.

ధరలలో తగ్గింపు, వినియోగదారులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. గృహాల ద్వారా దేశీయ PNG మరియు వాహన యజమానులు CNGని స్వీకరించడానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ తగ్గుదలతో సంగారెడ్డిలో డొమెస్టిక్ PNG యొక్క సవరించిన ధర SCMకి రూ. 45 (పన్నులతో సహా); LPGకి 31% తగ్గింపును సూచిస్తుంది మరియు CNG యొక్క సవరించిన ధర రూ.కిలోకు 90(పన్నులతో సహా) పెట్రోల్‌పై 45% తగ్గింపును సూచిస్తుంది.

Torrent Gas decreases PNG and CNG Price

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News