Monday, April 29, 2024

ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం

- Advertisement -
- Advertisement -
  • జడ్పి చైర్‌పర్సన్ మంజుశ్రీ

సంగారెడ్డి: ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించి సురక్షతంగా గమ్యస్థానాలకు చేరాలని జడ్పి చైర్‌పర్సన్ మంజుశ్రీ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో రాఖీ పౌరణమి సందర్భంగా గత నెల 30,31వ తేదీల్లో బస్సుల్లో ప్రయాణించి మహిళ ప్రయాణికులను లక్కీడ్రా నిర్వహించి ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా జడ్‌పి చైర్మెన్ మాట్లాడుతూ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించాలన్నారు. ముగ్గురు విజేతలకు టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్ చేతుల మీదుగా ఈ నెల 8న బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్, ఆర్టీసి సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News