Sunday, April 28, 2024

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపిపి

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ లోకి వలసలతో కార్యర్తల్లో జోష్ పెరిగింది. మండల మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య యాదవ్ తో పాటుగా, జవారిపేట సర్పంచ్, రేపాక, పెద్దలింగాపూర్ ఎంపిటిసిలు టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. ఈ సంధర్భంగా రేవంత్‌రెడ్డి తన నివాసంలో మానకొండూర్ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో జవారిపేట సర్పంచ్ అన్నాడీ కరుణరవీందర్‌రెడ్డి, రేపాక , పెద్దలింగాపూర్ ఎంపిటిసిలు కాతసుమలత మల్లేశం, కరివేద స్వప్నకర్ణాకర్‌రెడ్డి, డైరెక్టర్ చల్లనవీన్, నాయకులు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముక్కీస కేశవరెడ్డి, అనగోని యాదగిరి గౌడ్ తో పాటుగా పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు పసుల వెంకటి, ఒగ్గుదామోదర్,రత్నాకర్‌రెడ్డి, పాశంరాజేందర్‌రెడ్డి, సాగర్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News