Friday, April 26, 2024

హరిత తెలంగాణను సృష్టిద్దాం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొందాం

- Advertisement -
- Advertisement -

Tree plant in Green India challenge
మన తెలంగాణ/హైదరాబాద్: తమ పెళ్ళిరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వేడుకేదైనా వేదికేదైన అన్ని సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలనే పిలుపు మేరకు నిజామాబాద్ లోని ఫాంహౌస్‌లో సత్య మురళి దంపతులు మందారం మరియు అంజీర్ మొక్కలను నాటారు. మొక్కలు నాటే ఈ మహాయజ్ఞంలో ‘మేము సైతం‘ భాగస్వామ్యం అవు తున్నందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తు తరాలకు ప్రకృతి సమతుల్యం ఈ ఉద్యమం ద్వారా అందివస్తాయని ఆశాభావం వ్యక్తమవు తోందన్నారు. అందరం అందరి కోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం …గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొందామని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News