Friday, April 26, 2024

మొక్కలు నాటిన సమ్మతమే చిత్ర బృందం

- Advertisement -
- Advertisement -

Trees planted in Green India challenge

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో సమ్మతమే చిత్ర నటీనటులు కిరణ్, చాందిని, నిర్మాత ప్రవీణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిత్ర హీరో కిరణ్, హీరోయిన్ చాందిని మాట్లాడుతూ ఎంపి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగించినందుకు ఎంపి సంతోష్‌కి నిర్మాత ప్రవీణ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిత్ర బృందానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News