Friday, April 19, 2024

కష్టపడితే ఫలితం సాధిస్తాం: బొల్లం మల్లయ్య

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/చిలుకూరు: కష్టపడితే ఫలితం సాధిస్తామని కోదాడ ఎమ్మేల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం వారి క్యాంపస్ నందు చిలుకూరు మండల నాయకులు బొల్లం మల్లయ్యను ఘనంగా సన్మానించారు. వారు మునుగోడు ఉప ఎన్నికలలో ఎంతో పాత్ర వహించి వివిధ పార్టీల నుండి మండల గ్రామాలలోని ప్రజలను ఆహ్వానించి మునుగోడు టిఆర్‌ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించిన సందర్బంగా వారికి ఘన సన్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొండసైదయ్య, జిల్లా కోఫ్షన్ సభ్యుడు జానీమీయ, సహాకార సంఘం చైర్మన్‌లు, భాషంసైదులు, అల్సకాని జనార్ద్‌న్, మాజీ జడ్పీటీసి భట్టుశివాజి, రాంబాబు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News