Saturday, July 27, 2024

నేటి నుంచి ఎప్‌సెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇఎపిసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11వ వ రకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మంగళ, బుధవారాలో(మే 7,8) తేదీలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి, ఈ నెల 9, 10,11 తేదీలలో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇఎపిసెట్ పరీక్షకు ఈ ఏడాది 3,54,803 మందికి దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్ విభాగానికి 2,54,543 మంది, అ గ్రికల్చర్, ఫార్మా విభాగానికి 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎఇపిసెట్ పరీక్షలు 21 జోన్లలో పరీక్ష నిర్వహిస్తుండగా.. వీటిలో తెలంగాణలో 16, ఎపిలో 5 జోన్లు ఉన్నా యి.అగ్రికల్చర్, ఫార్మాకు135, ఇంజినీరింగ్‌కు 166 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బయోమెట్రిక్‌తో పాటు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అభ్యర్థుల గుర్తింపును అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

అమలులో నిమిషం నిబంధన
రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షా సమయానికి 90 నిమిషాల ముందు అంటే ఉదయం 7.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం 20 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు కన్వీనర్ సూచించారు. విద్యార్థుల వివరాల పరిశీలనకు 20 నిమిషాల సమయం పడుతుందని, కాబట్టి విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఉదయం సెషన్‌కు 9 గంటల వరకు రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట ఒక గుర్తింపు కార్డు, ఇటీవల తీసుకున్న ఫొటో తీసుకువెళ్లాలి. కళాశాల ఐడీకార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటర్‌ఐడీని గుర్తింపు కార్డుగా పరగణిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఆన్‌లైన్ ఫైల్ చేసిన దరఖాస్తుపై ఇన్విలేటర్ ఎదురుగా సంతకం చేయాలి.

వాటర్ బాటిళ్లకు అనుమతి ఉండదు
ఇఎపిసెట్ పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రాలలోనే విద్యార్థులు మంచినీళ్లతో పాటు డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యతో బాధపడే వారికి బిస్కట్లు అందజేస్తారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం తీసుకెళ్లాలి. ఇఎపిసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ఈకారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుకుంటే బయోమెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News