Monday, May 13, 2024

టెట్ ప్రాథమిక కీ విడదుల ..ఈ నెల 27న ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిఎస్ టెట్) 2023 పేపర్- 1, 2 ప్రాథమిక కీ లు బుధవారం విడుదలయ్యాయి. ప్రాథమిక కీపై ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లింకు ద్వారా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన జరిగిన టెట్ పేపర్ -1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది( 84.12 శాతం) హాజరయ్యారు.బి.ఇడి విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్ -2కు 91.11 శాతం మంది హాజరయ్యారు. టెట్ ఫలితాలు ఈ నెల 27వ తేదీన విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News