Thursday, May 2, 2024

రాజకీయ స్వార్థం కోసం ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు: పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎన్నికల సమయంలో అన్ని దేవాలయాల్లో పూజలు చేసిన స్టాలిన్ పుత్రప్రేమలో మునిగి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనుకేసుకరావడం సరైన విధానం కాదన్నారు. తండ్రీకొడుకులు  కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, తమ వైఫల్యాల నుంచి, తమ ప్రభుత్వంలోని అవినీతి మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోస్తున్నారని విమర్శించారు. ఉదయనిధి తన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులో తమ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో పాదయాత్ర ఘనంగా కొనసాగుతోందని రామేశ్వరం నుంచి మొదలైన యాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించినట్లు తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతోందని, భారతీయ జనతా పార్టీకి వస్తున్న ప్రజాధరణ చూసి డిఎంకె పార్టీ తట్టుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధితో పాటు ఎం. రాజాలపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఊసరవెల్లిలా సన్నాయి నొక్కులు నొక్కుతు మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు దీనినిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఇప్పటికైనా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిని అనర్హుడిగా ప్రకటించి భర్తరఫ్ చేయాలని పేర్కొన్నారు. తమిళనాడు బిజెపి శాఖ ఆధ్వర్యంలో గవర్నర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News