న్యూఢిల్లీ: తెలంగాణకు అప్పులపై ఉన్న వడ్డ్డీ రేటును తగ్గిస్తామని కేంద్రం హామీ ఇఛ్చింది. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తి చేయాలని తెలిపింది. రీ షెడ్యూల్, రుణాల చెల్లింపుల్లో మార్పులు చేస్తే.. ఆర్బిఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాలో స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్ట్ డౌన్ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ లఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) రుణాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయి. ప్రాజెక్టు స్పెషన్ పర్పస్ వెహికల్కు పవర్ ఫెనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రుణాలు వచ్చాయి. పిఎఫ్సి, ఆర్ఇసి లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయి. వాటికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఇసి పొడిగించింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపును పరిశీలిస్తాం’’ అని కేంద్రం స్పష్టం చేసింది.