Sunday, June 16, 2024

ఆ మంత్రి వైట్ పేపర్ లాంటి వారు… ఆయనపై ఇంక్ చల్లకండి: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వారని, ఆయనపై ఇంక్ చల్లకండని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. బిజెపి ఎల్‌పి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బట్టకాల్చి ఉత్తమ్‌పై వేస్తున్నారని, ఉత్తమ్‌పై ఆధారాలు లేని అభియోగాలు చేయడం మంచిది కాదన్నారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి సిఎంగా ఉంటారని, తడిసిన ప్రతి గింజను కొంటామని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారని, అధికార పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లడం సహజమేనని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News